కలెక్టర్ పమేలా సత్పతి
ఘనంగా సైన్స్ దినోత్సవం
బీబీనగర్, ఫిబ్రవరి 28 : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రదర్శనలతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపికైన ఇన్స్పైర్ ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే భవిష్యత్కు అణుగుణంగా కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థులకు సూచనలిచ్చే గైడ్ టీచర్లను అభినందించారు. డీఈఓ నర్సింహ మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి భరణి, భౌతిక, జీవశాస్ర్తాల జిల్లా ఫోరం అధ్యక్షులు రమేశ్, సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీకే రాజారెడ్డి, శాస్త్రవేత్త అంకతి రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. అదే విధంగా బొమ్మలరామారం మండాలానికి చెందిన మోడల్ స్కూల్ విద్యార్థిని అన్నబోయిన భవాని ఇన్స్పైర్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా భవాని, గైడ్ నవీన్కుమార్, హెచ్ఎం శోభారాణిని సన్మానించారు.
భువనగరి అర్బన్ : భువనగిరిలోని జీనియస్ పాఠశాలలో సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శనల గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సూర్యనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఏఓ రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని దేదీప్య పాఠశాలకు చెందిన వివేక్ అనే విద్యార్థి సౌరశక్తి పరికరాన్ని తయారు చేసి ప్రదర్శించాడు. పాఠశాల డైరెక్టర్ రంగారావు, విద్యార్థులు పాల్గొన్నారు.
వలిగొండ : మండల కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలలో సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు చేశారు. పాఠశాల డైరెక్టర్ బాలరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మోటకొండూర్ : సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు సైన్స్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు జ్యోతి, రఘురాంరెడ్డి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, వినోద్కుమార్, దానయ్య, నవనీత, అరుణ, శైలజ, భాగ్యలక్ష్మి, సృజన, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్, కృష్ణయ్య, మమత, లక్ష్మీప్రభ పాల్గొన్నారు.
విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి చూపాలి
ఆత్మకూరు(ఎం) : విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి చూపాలని ప్రధానోపాధ్యాయుడు కడారి సతీశ్, దడిపల్లి వెంకన్న సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సోమవారం మండలంలోని కూరెళ్ల, కఫ్రాయిపల్లి ఉన్నత పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రంపై క్విజ్, వక్తృత్వ పోటీలతోపాటు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉపాధ్యాయులు సునీత, అంజయ్య, శ్రీధర్, మల్లేశం, వెంకటేశ్వర్లు, సైదాచారి పాల్గొన్నారు.
వ్యాస రచన పోటీలు
రాజాపేట : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విజ్ఞానశాస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ‘విజ్ఞానశాస్త్ర పురోగతి-భారతీయ శాస్త్రవేత్తల కృషి’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజ్ఞానశాస్త్ర ప్రదర్శన, వ్యాసరచనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బూర్గు మహేందర్రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ గుర్రం పాండు, ఉప సర్పంచ్ రాజేశ్వర్గుప్తా పాల్గొన్నారు.
వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలి
గుండాల : విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలని గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరివర్ధన్ అన్నారు. సైన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ప్రయోగాలు చేశారు.