ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
భువనగిరి అర్బన్ / బీబీనగర్, ఫిబ్రవరి 28 : రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకూ వివాహ కానుకగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి, బీబీనగర్ పట్టణాల్లో సోమవారం ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు సొంత నిధులతో ఆడబిడ్డ లాంఛనంగా పట్టు చీర, ధోతి, టవల్ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉటుందన్నారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జడల అమరేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మండల కన్వీనర్ కంది మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామియాదవ్, జడ్పీటీసీ బీరు మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ల జిల్లా అధ్యక్షుడు నోముల పరమేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్ష కార్యదర్శులు, ఏవీ.కిరణ్ కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీలం ఓంప్రకాశ్గౌడ్, తాసీల్దార్ వెంకట్రెడ్డి, బీబీనగర్ ఎంపీపీ యర్కల సుధాకర్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలలాధ్యక్షుడు బాలచందర్, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మిశ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.