-మల్లాపురంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరిలో ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల
-జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 27 : జిల్లాలో నిర్వహించిన పల్స్పోలియో కార్యక్రమానికి విశేష స్పందన లభించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పరిపూర్ణాచారి ఆదివారం తెలిపారు. 21ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 63,670 మంది 0-5 ఏండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల పంపిణీ లక్ష్యం కాగా 60,800 మందికి వేసినట్లు తెలిపారు. 63మంది సూపర్వైజర్లను ఏర్పాటు చేసి 63 రూట్లుగా విభజించామన్నారు. సోమ, మంగళవారాల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించి నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు.
యాదగిరిగుట్ట : పోలియో రహిత సమాజానికి కృషి చేద్దామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మల్లాపురంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని సూచించారు.
భువనగిరి అర్బన్ : పోలియో నిర్మూలనకు కృషి చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో చిన్నారులకు ఎమ్మెల్యే శేఖర్రెడ్డి పోలియో చుక్కలు వేసి మాట్లాడారు. పోలియో చుక్కలు వేయించడంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. పట్టణంలోని బ్రహ్మంగారిగుడి సమీపంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో కలెక్టర్ పమేలా సత్పతి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అదేవిధంగా మన్నెవారిపంపు గ్రామంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు, బస్వాపురంలో ఎంపీపీ నరాల నిర్మాలావెంకటస్వామి, తాజ్పూర్లో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, సర్పంచ్ సురేశ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ క్రాంతి అవంచక, సర్పంచులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మోత్కూర్ : ఐదేండ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దత్తప్పగూడెంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్ ఎలుగు శోభాసోమయ్య, ఎంపీటీసీ ఆకవరం లక్ష్మాణాచారి, వైద్యాధికారి చైతన్యకుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు వెంకన్న, కళ్యాణ్ చక్రవర్తి, నర్సయ్య, ఆనందమ్మ, సుల్తానా, వైద్యాధికారి చైతన్యకుమార్ పాల్గొన్నారు.
రామన్నపేట : మండలంలోని కక్కిరేణి గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం ప్రారంభించగా మండల వ్యాప్తంగా సర్పంచులు, ఎంపీటీసీలు ప్రారంభించారు.
అడ్డగూడూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య ప్రారంభించారు. మండల వైద్యాధికారి నరేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వలిగొండ : మండల కేంద్రంలోని పీహెచ్సీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ నూతి రమేశ్ ప్రారంభించారు. జడ్పీటీసీ పద్మ, వైద్యుడు సుమన్కళ్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.
బీబీనగర్ : మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ ప్రవీణ్కుమార్, డాక్టర్ చంద్రశేఖర్, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. చౌటుప్పల్ : మున్సిపాలిటీ కేంద్రంలో దివీస్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ప్రారంభించారు. డీడీఎంహెచ్ఓ యశోద, సీహెచ్ఓ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
యాదాద్రి : యాదగిరిగుట్ట పట్టణంలోని గుండ్లపల్లి అంగన్వాడీ ఉప కేంద్రంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి వంశీకృష్ణ, ఏఎన్ఎం జ్యోతి, ఉమ, ఆశ వర్కర్లు, వెంకటమ్మ, సువర్ణ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్/ఆలేరు : మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. ఆలేరు పట్టణంలోని 6వ వార్డు బహుదూర్పేట అంగన్వాడీ కేంద్రం వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ప్రారంభించారు. ఆశ వర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ ప్రారంభించారు. అదే విధంగా మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు పడాల వనితాశ్రీనివాస్, పోగుల ఆంజనేయులు, నామసాని సత్యనారాయణ, శ్రీవాణి, సురేశ్నాయక్, జ్యోతీభాస్కర్, ఎంపీటీసీలు నవీన్కుమార్, కరుణాకర్, మోహన్బాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని గద్దరాళ్లతండాలో పల్స్ పోలియో కేంద్రాన్ని ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి ప్రారంభించారు. ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సర్పంచ్ రవీందర్రెడ్డి, డాక్టర్ శ్రవణ్కుమార్, వార్డు సభ్యుడు లింగానాయక్, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
రాజాపేట : మండల వ్యాప్తంగా 2,872 మంది పిల్లలకు 2,797 మందికి పోలియో చుక్కలు వేసినట్లు, 97.4 శాతం నమోదైనట్లు డాక్టర్ శివవర్మ తెలిపారు. రాజాపేటలో పల్స్ పోలియో కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రశాంత్ సందర్శించి పరిశీలించారు. సర్పంచులు మధుసూదన్రెడ్డి, గోపిరెడ్డి, భాగ్మమ్మ, రాజు, కరుణాకర్రెడ్డి, వెంకట్రెడ్డి, మమత, పరిమళ, ధనలక్ష్మి పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండల కేంద్రంలోని బస్ షెల్టర్ వద్ద పల్స్ పోలియోను ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత ప్రారంభించారు. మండల వ్యాప్తంగా 1,701 పిల్లలకు గాను 1,655 మందికి పోలియో చుక్కలు వేసినట్లు మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ తెలిపారు. ఎంపీటీసీ అంజిరెడ్డి, వైద్య సిబ్బంది, సర్పంచులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండల వ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మల్లాపురంలో పీహెచ్సీ డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో టీకాలు వేశారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంతోపాటు మండల వ్యాప్తంగా పోలియో చుక్కలు వేశారు. ఎంపీపీ మంగమ్మ, జడ్పీటీసీ నరేందర్గుప్తా, వైద్యాధికారి ప్రణీష, సర్పంచ్ నగేశ్, ఎంపీటీసీ కవిత, సీహెచ్ఓ కరుణాకర్ పాల్గొన్నారు.
గుండాల : మండల కేంద్రంలో ఎంపీపీ అమరావతి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వైద్యాధికారి శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.