యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వ లేకపోతున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లాపురం, మైలార్గూడెం, జంగంపల్లి, రాళ్లజనగాం, బాహుపేట, తాళ్లగూడెం, సైదాపురంతో పాటు పలు గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డైనేజీ, నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతుంటే, కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. ఇలాంటి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తాను భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందన్నారు. మండలంలోని మల్లాపురం గ్రామ చెరువును రూ.2కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కీసర, సిద్ధిపేట, గజ్వేల్ నుంచి వచ్చే ప్రయాణికులకు మల్లాపురం మిని ట్యాంక్బండ్ ఆహ్లాదాన్ని అందిస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ నిధులను గ్రామంలోని అభివృద్ధి పనులకు ఉపయోగించుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. స్పెషల్ డెవలెప్మెంట్ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరింత అవకాశం దక్కిందన్నారు. మండలంలోని మల్లాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కర్రె వెంకటయ్య రూ.2.18లక్షల సొంత డబ్బులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వాటిని ప్రభుత్వ విప్ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచులు కర్రె వెంకటయ్య, కాదూరి రజిత, గుండ్ల సరిత, కుండె పద్మ, తాళ్ల భాస్కర్, సిరికొండ సత్యనారాయణ, ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి, గుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మిట్ట వెంకటయ్య, మారెడ్డి కొండల్రెడ్డి, కసావు శ్రీనివాస్, కవిడే మహేందర్, బీర్ల మహేశ్, స్వామి, పల్లెపాటి బాలయ్య పాల్గొన్నారు.