మోత్కూరు : అభివృద్ధి, సంక్షేమంలో మోత్కూరు మున్సిపాలిటీని ఆదర్శంగా నిలిపేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి అధ్యక్షతన వార్షిక బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.21 కోట్లా 6లక్షలా 60 వేల అంచనా బడ్జెట్ను మున్సిపల్ పాలకవర్గం ఆమోదించింది. ఇందులో పన్నుల ద్వారా రూ.184 లక్షలు, ఇతరాల ద్వారా 2 కోట్లా 19 లక్షలా 60 వేలు, డిపాజిట్ల ద్వారా రూ.5లక్షలు, ప్రభుత్వ నిధులు రూ.16కోట్లా 98 లక్షలు జమ కానున్నాయని సభకు నివేదించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలకు రూ.కోటీ 50లక్షలా 56 వేలు, పారిశుధ్య నిర్వహణకు రూ.3కోట్లా 2లక్షలా 20 వేలు, విద్యుత్ బిల్లులు రూ.51లక్షలు, రుణాల చెల్లింపులు రూ.16లక్షలు, గ్రీన్ బడ్జెట్ 40.36లక్షలు, ఇంజినీరింగ్ సెక్షన్ నిర్వహణ కోసం రూ.75.50లక్షలు, పరిపాలన నిర్వహణ కోసం రూ.30.62లక్షలు, పట్టణ ప్రణాళిక కోసం రూ.2.50లక్షలు, బలహీన వర్గాల ప్రాంతాల అభివృద్ధికి రూ4.86లక్షలు, డిపాజిట్ అండ్ లోన్ చెల్లింపులకు రూ.5లక్షలు కేటాయింపునకు బడ్జెట్ను రూపొందించారు. అనంతరం ఎమ్మెల్యే కిశోర్ మాట్లాడారు. మున్సిపాలిటీలోని ప్రతి వీధిని సీసీ రోడ్డుగా మార్చుతామని, డ్రైనేజీ కాల్వల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని సూచించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. తొలిసారి మున్సిపల్ సమావేశానికి హాజరైన కలెక్టర్ను చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి పూల మొక్క అందజేసి సన్మానించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, కమిషనర్ షేక్ మహమూద్, ఏఈఈ శ్రీనివాస్శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.