ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, ఫిబ్రవరి 26 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లెలు ప్రగతి పుంతలు తొక్కుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని జనంపల్లి, ఇస్కిళ్ల గ్రామాల్లో రూ.20లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లోని వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటిని స్థానిక నీళ్లతో కాకుండా వేరుగా అందించాలని డీఈ దీన్దయాల్కు సూచించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సవరించాలని, అవసరమైన చోట విద్యు త్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఏఈ నర్సింహను ఆదేశించారు. అవసరమైన చోట మురుగు కాల్వల నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని పీఆర్ఏఈ గాలయ్యకు సూచించారు. ఇతర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తేగా సంబంధిత అధికారులతో అక్కడే ఫోన్లో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ గాదే జలేందర్రెడ్డి, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు మందడి ఉదయ్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నెబోయిన అయిలయ్య, సర్పంచులు రేఖయాదయ్య, బందెల యాద య్య, ఎంపీటీసీలు వేమవరపు సుధీర్బాబు, దోమల సతీశ్, మల్లేశం, దామోదర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, మెట్టు మహేందర్రెడ్డి, పిట్ట కృష్ణారెడ్డి, ప్రకాశ్, నరేందర్, గర్దాసు విక్రం, నరేందర్ పాల్గొన్నారు.