బొమ్మలరామారం,ఫిబ్రవరి26: మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఫకీర్గూడ, మేడిపల్లి, మైలారం, మైలారం తండా, నాగినేనిపల్లి, తిరుమలగిరి, మైసిరెడ్డిపల్లి, హాజీపూర్, బొమ్మలరామారం, మల్యాల గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. అనంతంరం మైలారం గ్రామంలో జడ్పీ చైర్మన్తో కలిసి రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతోనే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, వైస్ ఎంపీపీ గొడుగు శోభ, పీఏసీఎప్ చైర్మన్ గూదె బాలనర్సింహ, వైస్ చైర్మన్ కొండల్రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి, ఎంపీటీసీ బోయిని లత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మేడబోయిన గణేశ్, సర్పంచులు సుర్వి గోవింద్గౌడ్, ధీరావాత్ సరీయా, భట్కీర్ బీరప్ప, నూనావత్ కుమార్, నోముల రమాదేవి, మహేశ్ గౌడ్, భరత్ పాల్గొన్నారు.