యాదాద్రి, జూలై 30: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని బైండ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుళ్ల గౌరీశంకర్ అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా కమిటీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత సీమాంధ్ర ప్రభుత్వం లో బైండ్ల కులస్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంత రం సీఎం కేసీఆర్ సారథ్యంలో బైండ్ల కులస్థులకు సముచిత గౌరవం దక్కుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బైండ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్పుల భాస్కర్, ఉపాధ్యక్షులు పులి యాదగిరి, ఎర్పుల గాలయ్య, కార్యదర్శులు ఇంద్రవెల్లి సంజీవ, మారపాక సుధాకర్, వగ్గు శ్రీకాంత్, దేశపాక నగేశ్, నల్లగొండ జిల్లా కన్వీనర్ కందుకూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శంగా దళితబంధు
చౌటుప్పల్, జూలై30: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యావత్ దేశానికే ఆదర్శంగా మారిందని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొయ్యడ శేఖర్గౌడ్ అన్నా రు. శుక్రవారం మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియా డారు. గత పాలకులు దళితులను కేవలం ఓటు బ్యాంక్ గా వినియోగించుకున్నారన్నారు. ఆయన వెంట వెంకటేశ్గౌడ్, కేతరాజు శేఖర్, నారెడ్డి రాజిరెడ్డి ఉన్నారు.