ఆలేరు, మార్చి 12 : ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరులో శనివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను చూసి తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని అక్కడి నాయకులు కోరుతున్నారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో గతంలో గెలిచిన నాయకులు అభివృద్ధి ఏమీ చేయలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే గొంగిడి సునీత గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని విభిన్న స్థాయిల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. ఐటీఐ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల భవనాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఆలేరు పట్టణంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇస్తామన్న ఉద్యోగాలను సీఎం కేసీఆర్ కచ్చితంగా భర్తీ చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, టీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కౌన్సిలర్లు బేతి రాములు, నర్సింహులు, సునీత, శ్రీకాంత్, రాజేశ్, లత, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, నాయకులు పంతం కృష్ణ, కుండె సంపత్, వెంకటేశ్, మురళి, సంతోష్, మహేశ్వరి, అనసూయ పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
యాదాద్రి సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. చెందిన జగిని లక్ష్మీప్రసన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కును శనివారం యాదగిరిగుట్టలో అందజేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మిట్ట వెంకటయ్య, నాయకులు పయ్యావుల శ్రీనివాస్, సీస కృష్ణగౌడ్ పాల్గొన్నారు.