మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
సంస్థాన్ నారాయణపురం, మార్చి 2 : రాచకొండ ప్రాంతంలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు, గాలిబ్ షాహీద్ దర్గా ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిస్తున్నాయని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శివాలయం, గాలిబ్ షాహీద్ దర్గాను ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్ రెడ్డి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతీగౌడ్తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ శంభులింగేశ్వరస్వామికి పాలాభిషేకం చేశారు. గాలిబ్ షాహీద్ దర్గా వద్ద దట్టీలు కట్టి ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు. అదే విధంగా మండల కేంద్రంలోని ఉమా మహేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఏస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దోనూరి జైపాల్రెడ్డి, ఎంపీటీసీ దోనూరి శ్రావణి, రాచకొండ సర్పంచ్ ఒగ్గు గణేశ్, చండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలూనాయక్ పాల్గొన్నారు.
వీరభద్రేశ్వరుడి రథోత్సవం
బీబీనగర్(భూదాన్పోచంపల్లి), మార్చి 2 : మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 101 యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణ కేంద్రంలో నల్లవీరభద్రేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్యామివారిని డప్పువాయిద్యాల నడుమ పురపాలక వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎస్కేపీ ఫౌండేషన్ చైర్మన్ పాలెం శివకృష్ణగౌడ్ సహకారంతో అన్నదానం చేశారు. అంతకు ముందు మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మోటె రజితారాజు, గుండు మధు, దేవరాయ కుమార్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
బహుమతుల అందజేత
బీబీనగర్ : మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని చిన్నరావులపల్లిలో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్, కబడ్డీ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోరుకంటి బాలచందర్, సర్పంచ్ బక్కన్న బాలమణీదేవదాస్, ఉప సర్పంచ్ బద్దం శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.