చౌటుప్పల్ రూరల్, మార్చి 1 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులు భేషుగ్గా ఉన్నాయని మహారాష్ట్రలోని పుణే ఉన్నతస్థాయి అధికారులు మెచ్చుకున్నారు. పల్లె ప్రగతి పనుల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎస్.లింగోటం గ్రామంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధుల గురించి తెలుసుకున్నారు. అంతకుముందు ఎల్లంబావి గ్రామ పరిధిలో మిషన్ భగీరథ సంపును పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనితీరును ప్రశంసించారు. పర్యటించిన వారిలో పుణే జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ మిలింద్ తాండె, వివిధ శాఖల అధికారులు శివాజీ విదాతే, ప్రకాశ్ కాటేల్, సుదిత్ భగవత్, శేఖర్ గైక్వాడ్, శివరాం హెగ్డే, వికాశ్ కుద్యే ఉన్నారు. వారి వెంట యాదాద్రి జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి, డీపీఓ సునంద, డీఎల్పీఓ సాధన, ఎంపీడీఓ రాకేశ్రావు, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సర్పంచ్ ఆకుల సునీత, ఉన్నారు.