భువనగిరి అర్బన్, మార్చి 1 : యాదాద్రి భువనగిరి జిల్లాను పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ముందంజలో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 712 ప్రభుత్వ, 156 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఉన్నత, జడ్పీ పాఠశాలలు 168, మోడల్ స్కూళ్లు 7, టీఎస్ఆర్జేసీ 3, మహాత్మాజ్యోతిరావుపూలే 7, తెలంగాణ సాంఘీక సంక్షేమ 7, మాదర్శాల పాఠశాల 1, మైనారీ సోషల్ వెల్పేర్ పాఠశాలలు 3, కేజీబీవీ 7, ఆశ్రమ పాఠశాల 1, అర్బన్ పాఠశాల 1, ఉన్నాయి. మొత్తం 6,990 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అదే విధంగా జిల్లాలో ప్రైవేటు పాఠశాలల 156 ఉండగా ఇందులో 2021-22 పరీక్షలకు 2,485 మంది విద్యార్థులకు హాజరుకానున్నారు.
పక్కాగా ప్రణాళిక అమలు..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. అందుకు అనుగుణంగా రూపొందించిన ప్రణాళికను ఇప్పటికే జిల్లాలోని 238 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. మార్చి 14 నాటికి సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా వెనుకబడిన విద్యార్థ్ధులపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థ్ధుల తల్లిదండ్రులతో విద్యార్థుల ప్రగతిపై ఆరా తీస్తూ ఉత్తీర్ణతశాతం పెంచేలా కృషి చేస్తున్నారు.
ఉత్తీర్ణత పెంచే దిశగా అడుగులు..
పదో తరగతి విద్యార్థ్ధులకు సకాలంలో సిలబస్ పూర్తి చేయడంతోపాటు ఆయా సబ్బెక్టుల్లో నైపుణ్యం సాధించి పది ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక తరగతులు ప్రారంభించింది. విద్యార్థ్ధులకు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 గంటల నుండి 5.45 వరకు అధనపు తరగతులను నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తి చేసిన అనంతరం జనవరి నుంచి పూర్తిస్థ్ధాయిలో ప్రతిరోజు ఓ సబ్జెక్టుపై విద్యార్థ్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థ్ధులకు గ్రాడ్ టెస్ట్లు నిర్వహించి వారిని ప్రీ-ఫైనల్కు సిద్ధ్దం చేయనున్నారు.
ఫలితాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కామన్ బోర్డు నుంచి తయారు చేసిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకునేలా ఏర్పాటు చేశాం. ఈ తరగతులు ఫిబ్రవరి10 నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 8.45 నుంచి 9.45 వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే సిలబస్ 90 శాతం పూర్తయింది. మరో పది రోజుల్లో సిలబస్ పూర్తికానుంది. పది ఫలితాల్లో జిల్లాను ముందజంలో ఉంచేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నాం.
– కానుగల నర్సింహ, జిల్లా విద్యాశాఖాధికారి