నేడు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్
ముఖ్యమ్ంరత్రి కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
నల్లగొండ ప్రతినిధి, మార్చి29(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. పార్టీ అభ్యర్థిగా నోముల భగత్కుమార్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో మంత్రి జగదీశ్రెడ్డితోపాటు ఆశావాహులైన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, మరో కీలక నేత ఎంసీ కోటిరెడ్డితో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీ సంతోశ్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి సుభాశ్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్రెడ్డి, నోముల సతీమణి లక్ష్మీ కూడా ఉన్నారు. వీరందరి సమక్షంలోనే కేసీఆర్ మిగతా ఆశావాహుల ఆమోదయోగ్యంతో భగత్కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే సందర్భంగా పార్టీ బీ-ఫాంను, ప్రచార ఖర్చు నిమిత్తం రూ.28లక్షల విలువైన చెక్ను కూడా భగత్కు కేసీఆర్ అందజేశారు.
తండ్రి నర్సింహయ్య దారిలోనే..
తన తండ్రి నోముల నర్సింహయ్య నిత్యం ప్రజలతో ఉండడంతో సీపీఎంలో అనేక ఉద్యమాల సమయంలో ఆయన వెంటే కుటుంబమంతా నడిచేది. భార్య లక్ష్మీతోపాటు కుమారుడు భగత్, కూతుళ్లు కూడా ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యే వారు. పార్టీ మీటింగ్లకు హాజరవుతూ ప్రజా సమస్యలపై స్పందించే గుణంతో ఎదిగొచ్చారు. ఈ క్రమంలో నోముల నర్సింహయ్య టీఆర్ఎస్లో చేరి నాగార్జునసాగర్ నుంచి 2014 లో తొలిసారిగా బరిలోకి దిగిన సమయంలో భార్య, కుమారుడు, కూతుళ్లు కూడా ప్రచారం లో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో పార్టీ మీటింగ్ల్లో పాల్గొన్నారు. 2014 లో ఓడిపోయినా నోముల నర్సింహయ్య నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని అక్కడే ఇన్చార్జిగా పార్టీ అభివృద్ది కోసం కృషి చేశారు. ఈ క్రమంలో కుమారుడు భగత్కుమార్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ సమస్యలు, పరిష్కారాలపై పట్టును సాధించారు. ఇదే క్రమంలో 2018లో ఎన్నికల సమయంలో భగత్ నేరుగా పార్టీ క్యాడర్తో మమేకమయ్యారు. నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలిచాక కూడా భగత్ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం మరింతగా పెరిగింది. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా అందరి నేతలతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తండ్రి మరణానంతరం భగత్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గ ప్రజల్లో సానుకూల పరిణామాలు నెలకొన్నాయి.
అనేక అభివృద్ధి కార్యక్రమాలు..
ఇరిగేషన్ పరిధిలోని నాగార్జునసాగర్ పట్టణానికి మున్సిపాలిటీ హోదా కల్పించడంతోపాటు గిరిజన ప్రాంతాలతో కూడిన తిరుమగిరిసాగర్ను కొత్త మండలంగా ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. నియోజకవర్గ వ్యాప్తంగా సాగు, తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం లాంటి మౌలిక వసతుల కల్పనలోనూ నిరంతరం శ్రమించారు. అభివృద్ధిపై తపనతో అనేకమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిస్తూ నిధులు మంజూరు చేయించుకున్నారు. తన చివరి క్షణాల వరకు సాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడుతూ వచ్చారు.
ఇవి కూడా చదవండి
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
నేడు శ్యామ్సంగ్ 5జీ ఫోన్ ఎస్20 ఎఫ్ఈ లాంచింగ్!