ఆలేరురూరల్ : రాష్టానికే కొలనుపాక రైతులు దిక్సూచిగా నిలువాలని పభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. కేవలం కొలనుపాక గ్రామా నికి రూ. 3.67కోట్ల రైతుబంధును ముఖ్యమంతి కేసీఆర్ పభుత్వం అందజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతాంగానికి సకల సౌకర్యాలు కల్పించిన గొప్ప నాయకుడు అని వారు కొనియాడారు.
గురువారం కొలనుపాకలో రైతుసంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సోమేశ్వరస్వామి రైతు సంఘం జిల్లాలోనే ఆదర్శ రైతు సంఘంగా ఎదుగాలన్నారు. కొలనుపాకకు చెందిన ఆరుట్ల రాంచంద్రారెడ్డి రైతాంగానికి ఎంతో కృషి చేశాడని గుర్తు చేశారు. త్వరలోనే మల్లన్న సాగర్ ద్వారా గంధమల్ల రిజర్వాయర్ నింపి ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. రైతులు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయడం నేర్చుకోవాలన్నారు. వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగల మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
అనంతరం గ్రామంలో నాబార్డు నిధులతో ఏర్పాటు చేసిన సంతను పరిశీలించారు. సోమేశ్వరస్వామి రైతు సంఘం ఆధ్వర్యంలో గొంగిడి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యకమంలో సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీపసాద్రెడ్డి, సోమేశ్వరస్వామి రైతు సంఘం అధ్యక్షుడు బెదరబొయిన సిద్ధిరాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, నాబార్డు ఏజీఎం వినయ్కుమార్, ఏడీఏ వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ కుడుదుల నగేష్, మదర్డెయిరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగూల శ్రీనివాస్, మార్కెట్ పీఏసీఎస్ డైరెక్టర్లు ఆరె మల్లేశ్గౌడ్, మామిడాల నర్సింహులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొటగిరి పాండరి, రైతులు పాల్గొన్నారు.