యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మితమవుతున్న ప్రతికట్టడం కృష్ణశిలలతో నిర్మితమయ్యే విధంగా వైటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే యాదాద్రి ప్రధానాలయం ప్రారంభానికి సిద్ధం కాగా కొండపై నిర్మితమవుతున్న ఇతర నిర్మాణాల పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రధానాలయం ఈశాన్య ప్రాంతంలో స్వామివారికి వినియోగించుకునేందుకు నిర్మించిన విష్ణు పుష్కరిణి రక్షణగోడను కృష్ణశిల రంగులను అద్దుతున్నారు.
పూర్తి కృష్ణశిలా రూపం కనిపించే విధంగా విష్ణు పుష్కరిణికి రాతిరంగులతో హంగులు దిద్దుతున్నారు. దీంతో పాటు ఇప్పటికే ప్రధానాలయం దక్షిణ, పడమర రక్షణగోడను రాతి రంగులతో మెరుగులు దిద్దిన అధికారులు క్యూ కాంఫ్లెక్స్ను సైతం కృష్ణశిల హంగులతో తీర్చిదిద్దనున్నారు.