మేళ్లచెర్వు, నవంబర్ 26 : రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.65.20లక్షలతో నిర్మించిన వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతన గోదామును ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ కాకునూరి శంభిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, పీఏసీఎస్ సీఈఓ వెంకట్రెడ్డి, డీసీసీబీ, పీఏసీఎస్ డైరెక్లర్లు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం
హుజూర్నగర్ : పట్టణానికి చెందిన విద్యార్థులు కె.విద్య, పి.వైష్ణవి నేషనల్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వారు పోటీలకు వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి ఎమ్మెల్యే సైదిరెడ్డి శనివారం వారికి ఆర్థిక సాయమం దించారు. కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ జక్కుల శంభయ్య, టీఆర్ఎస్ నాయకుడు విజయ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
పాలకవీడు మండలంలోని అలింగపురానికి చెందిన డేరింగుల కాశమ్మకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.28వేల చెక్కును క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, వీరారెడ్డి, వెంకన్న, కోటయ్య, సింహాద్రి పాల్గొన్నారు.
వైకుంఠధామం ప్రహరీ పనులకు శంకుస్థాపన
మఠంపల్లి : మండలంలోని పెదవీడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైకుంఠధామం ప్రహరీ పనులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, మఠంపల్లి, పెదవీడు సర్పంచులు మన్నెం శ్రీనివాస్రెడ్డి, బీబీకుతుబ్, హుజూర్నగర్ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చిలక సతీశ్, సాముల వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.