బీబీనగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి
బీబీనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాలో రూ.15 లక్షలు, గుర్రాలదండిలో రూ.15 లక్షలు, నీల తండాలో రూ.15లక్షలు, జంపల్లిలో రూ. 15 లక్షల వ్యయంతో హెచ్ఎండీఏ ద్వారా మంజూరైన నిధులతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపా రు. ఇటీవల వివిధ గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన 21 మందికి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయం అంద జేశారు. అదేవిధంగా సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2,52,000/- చెక్కుల ను 9 మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.అనంతరం గుర్రాలదండి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను గ్రామాధ్యక్షుడు ధరావత్ భిక్షపతి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్దాయి సంఘం చైర్మన్ జడ్పీటీసీ గోలి ప్రణీతారెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, సర్పంచ్లు బర్మావత్ బుచ్చాలు, భానోతు లాలు, నునావత్ శ్రీనివాస్, ధంతూరి భాలరాజు, ఎంపీటీసీ ముడావత్ వాణి , నాయకులు కొలను దేవేందర్ రెడ్డి, ఎండీఅక్బర్, టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్ తదితరులు పాల్గొన్నారు.