భువనగిరి కలెక్టరేట్ : ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసుల ను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. శనివారం సాయంత్రం ఆమె గూగుల్మీట్ ద్వారా జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అత్యాచార ఘటనలకు సంబంధించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడా రు. సమావేశంలో జూలై 2020 నుంచి జూన్ 2021వరకు నమోదైన కేసులు, వాటి పరిష్కార తీరును పోలీసు అధికారులు, అధికార, అనధికా ర సభ్యులతో కలిసి సమీక్షించారు.
ఎస్సీ, ఎస్టీల బాధితులకు సత్వరమే ఎక్స్గ్రేషియా అందించేందుకు పోలీసు అధికారు లు ఎఫ్ఐఆర్ నివేదికలను జాప్యం లేకుండా కలెక్టరేట్కు అందించాలన్నారు. ప్రతినెలా 30వ తేదీన జరిగే సివిల్రైట్స్ డేలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధికార, అనధికార సభ్యులు విధిగా పాల్గొనాలన్నారు. కోర్టుల్లో ఉన్న కేసులకు సం బంధించి సకాలంలో కౌంటర్ ఫైలు దాఖలు చేసి బాధితులకు సత్వర న్యా యం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించా రు. యాదగిరిగుట్ట, భువనగిరి, టుప్పల్ ఏసీపీలతో కేసుల వారీగా పెండింగ్ వివరాలు, తగు కారణాలను సమావేశం లో సమీక్షించారు.
గూగుల్మీట్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీలు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురా ధ, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి బాల్సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, హార్టికల్చర్ అధికారి అన్నపూర్ణ, మంగ్తానాయక్, సజ్జన్, డప్పు వీరస్వా మి, నరహరి, పాచ్యానాయక్, దుర్గయ్య తదితరులు ఉన్నారు.