బొమ్మలరామారం: రైతులు సహాకార సంఘాలు తక్కువ వడ్డీతో అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని టెస్కాబ్ వైస్ చైర్మన్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ సొసైటీల నుంచి ఎకరానికి రూ.40వేల చొప్పున గరిష్టంగా మూడు లక్షల వరకు పావలా వడ్డీకి రుణం సులభంగా అందిస్తున్నామన్నారు.
పౌల్ట్రీ,షీప్ ఫామ్లు , ట్రాక్టర్ కొనుగొలును కేటగిరీల వారీగా సబ్సిడీ రుణాలు పొందవచ్చన్నారు. వ్యవసాయ భూములు విలువ ఎకరానికి రూ.5లక్షల వరకు ప్రభుత్వం పెంచినందున కమర్షియల్ లోన్ ఎకరానికి 2లక్షల వరకు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, ఉప సర్పంచ్ జూపల్లి భరత్, బెజ్జేంకి పాపిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కుక్కదువ్వు రామకృష్ణ, బేతాళ పాండు, ఎల్లబోయిన గోపాల్, కరెకంటి రాజు, రామకృష్ణ, శాంతాచారీ పాల్గొన్నారు.