Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకే ఇంట్లోని ముగ్గురిని బలి తీసుకుంది. భువనగిరిలో పనులు ముగించుకొని ఆటోలు ఇంటికి వెళ్తున్న కూలీలపైకి డీసీఎం వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఒకేసారి దుర్మరణం చెందడంతో బీఎన్ తిమ్మాపూర్లో విషాదం నెలకొంది.
సోమవారం సాయంత్రం వడపర్తి వద్ద ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బి.ఎన్.తిమ్మాపూర్కు చెందిన మహిళ, ఆమె ఇద్దరు కుమారులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేతమ్మ, సురేశ్ నరేశ్ ప్రాణాలు కోల్పోయారు.