భువనగిరి అర్బన్ : గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి, సీసీరోడ్లు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల తొలగింపు రెండు రోజుల్లో ప్రారంభించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అధికారులకు సూచించారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో ప్రతి వార్డును సందర్శించి అమ్మ మీ సమస్యలను పరిష్కరించడానికే మీ గ్రామానికి వచ్చానని, గ్రామంలో ఉన్న సమస్యలను వివరించాలని మహిళలను ఆప్యాయతగా పలకరించారు. గుర్తించి చోట అండర్గ్రౌండ్ డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న స్థలాన్ని సేకరించేందుకు సంబంధిత భూమి సర్వే చేసి స్థలాన్ని కేటాయించి వెంటనే అప్పగించాలని తాసిల్దార్ను ఆదేశించారు. వార్డులను కలియతిరిగి రోడ్డు మధ్యలో నిరుపయోగంగా ఉన్న డ్రైనేజీని పరిశీలించి ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, బీసీ కమ్యూనిటీహాల్కు ప్రభుత్వ భూమిని కేటాయించాలని తాసిల్దార్కు సూచించారు. గతంలో ఎస్సీ సన్మాన వాటిక రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించలేదని, డ్రైనేజీలో వాడే సిమెంట్ కుండీలను (బిల్లులు) దుర్వినియోగం చేయడంతో ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వీడాలని ఇలా చేస్తే సహించేది లేదన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న, శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేయలన్నారు.
ఎస్సీ నూతన వైకుంఠధామం నిర్మాణానికి, అండర్గ్రౌండ్, సీసీ రోడ్లు నిర్మాణ పనులకు మొదటి విడుతలో రూ. 50లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధానకార్యదర్శి నీల ఓంప్రకాశ్గౌడ్ పాల్గొన్నారు.