చౌటుప్పల్ : పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించడం హర్షనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. స్థానిక కృష్ణ రీలింగ్ పరిశ్రమను శనివారం ఆమె సందర్శించారు. మల్బారీ కాయల నుంచి దారం తీసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి 70నుంచి 80మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. ఆమె వెంట ఆర్డీవో సూరజ్కుమార్, డీహెచ్వో అన్నపూర్ణ, శ్రీహరి పాల్గొన్నారు.