రాజాపేట: పాఠశాలల్లో చేపడుతున్న పారిశుధ్య పనులు భేష్గా ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో బడులను పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలన్నారు.
ఆదేవిధంగా నెమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పారిశుధ్య పనులను శుక్రవారం డిప్యూటీ తహాసీల్దార్ శివగణేశ్ కుమార్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రామరాజు, ప్రధానోపాధ్యాయులు మల్లెమాల, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.