యాదగిరిగుట్ట రూరల్: మాసాయిపేట గ్రామంలోని కిసాన్ పాల సంఘం నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ గొంగి డి సునీతామహేందర్రెడ్డి నిధులు మంజూరు చేసినట్లు సంఘం చైర్మన్ వంటేరు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పాల సంఘం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేయగా స్పందించి రూ. 4లక్షలను మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వవిప్ దంపతులు గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ మహేందర్రెడ్డికి కిసాన్ పాల సంఘం సభ్యులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కా ర్యక్రమంలో నాయకులు వంటేరు సురేశ్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సొప్పరి మధు, కేశవరెడ్డి, వెంకటయ్య, కిష్టయ్య పాల్గొన్నారు.