బీబీనగర్ : మండల పరిధిలోని పడమటిసోమారం గ్రామంలో గల లింగబసవేశ్వరస్వామి హుండీ లెక్కింపును కార్యనిర్వహన అధికారి వెంకట్రెడ్డి, ఈఓ నరేందర్రెడ్డి, దేవస్థాన చైర్మన్ వాకిటి బస్వారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీ లెక్కింపు ద్వారా రూ. 8,47,022/- ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈఓ నరేందర్రెడ్డి తెలిపారు.
హుండీ లెక్కింపులో గ్రామ సర్పంచ్ తలబోయిన గణేష్ యాదవ్, ధర్మకర్తలు ముత్యాలు, అంజయ్య, బాలనర్సింహా, చంద్రయ్య, పూజారులు యలమంచిలి రాజశేఖరశర్మ, జర్పుల పుణ్యసింగ్, భక్తులు దేవాలయ సిబ్బంది వున్నారు.