యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. పాంచరాత్రగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటల పాటు పుష్పార్చన పూజలు కొనసాగాయి.
స్వామివారి బాలాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు.