మోటకొండూర్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా దళితులు ఆర్థికంగా అభి వృద్ధి చెందాలనే ఉద్ధేశ్యంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి ఆకర్షితులై భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతు న్నాయని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఆయన నివాసంలో మోటకొండూర్ మండలంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 50మంది నాయకులకు టీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన నాయకులు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ విప్ సునీతారెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, మోటకొండూర్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కో ఆప్షన్ సభ్యుడు బురాన్, సీనియర్ నాయకుడు భూమండ్ల శ్రీనివాస్తో పాటు పార్టీ లో చేరినవారు బొట్ల శ్రీనివాస్, మీసాల ఉప్పలయ్య, బొట్ల రమేశ్, జహంగీర్, బొట్ల కృష్ణ, నవీన్, శ్రీధర్ పాల్గొన్నారు.