పాలకీడు : నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చెరువుతండా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాణావత్ వెంకటేశ్వర్లు, శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. గురువారం చిన్న కుమారుడు హనుమంతు(4) ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు సంపులో పడిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తన మాటలతో, అల్లరితో సందడి చేసిన హనమంతు ఆకస్మిక మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకున్నాయి.