యాదాద్రి భువనగిరి : యాదాద్రి గుట్టకు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అంతలోని అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు స్వప్న ఒక హ్యండ్ బ్యాగును గుర్తించి వెంటనే ఉన్నతధికారుల కు సమాచారం ఇచ్చింది. వారు తనిఖీ చేసి దానిలో కొంత నగదు, వెండి పట్టిలు గుర్తించి మైక్లో అందరికి సమాచారం అందిచారు. పోయిన బ్యాగు పోలీసుల వద్ద భద్రంగా ఉందని గుర్తించిన భక్తులు బ్యాగులో వస్తువుల వివరాలు చెప్పి బ్యాగును తీసుకున్నారు. నిజాయితీ చాటుకున్న పోలీసు హోంగార్డును పలువురు భక్తులు, పోలీసు అధికారులు అభినందిచారు.