తుర్కపల్లి, నవంబర్ 12 : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్ సూచించారు. మండలంలోని వెంకటాపురం, దత్తాయిపల్లి, ఇబ్రహీంపురం గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహరెడ్డి, సర్పంచులు ప్రభాకర్రెడ్డి, సత్యనారాయణ, రామ్మోహన్శర్మ, మహేందర్, ఎంపీటీసీలు నవీన్కుమార్, కరుణాకర్, వనజ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే సర్కారు లక్ష్యం
బొమ్మలరామారం రైతుల సంక్షేమమే సర్కారు లక్ష్యమని ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి అన్నారు. మండలంలోని ఫకీర్గూడెం, ప్యారారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ పంటలను దళారులకు అమ్మి పోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రంలో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, సర్పంచులు గణేశ్, గోవింద్గౌడ్, బీరప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాంరెడ్డి, విజయలక్ష్మి, జయమ్మ, అంజిరెడ్డి, భరత్ పాల్గొన్నారు.
నాణ్యత పాటించాలి..
మోటకొండూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య రైతులకు సూచించారు. సొసైటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. తాసీల్దార్ రాము, ఏఓ సుబ్బూరి సుజాత, సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జంగారెడ్డి, సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఐలయ్య, టీఆర్ఎస్ నాయకుడు విజయ్రెడ్డి పాల్గొన్నారు.
వంగపల్లిలో కేంద్రం ప్రారంభం
యాదాద్రి : మండలంలోని వంగపల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ శుక్రవారం ప్రారంభించారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎగ్గిడి బాలయ్య, సర్పంచ్ కవిత, ఎంపీటీసీ మౌనిక, ఉప సర్పంచ్ స్వామి, మదర్ డెయిరీ డైరెక్టర్ శ్రీశైలం, పీఏసీఎస్ డైరెక్టర్లు శ్రీనివాస్, భిక్షపతి, నాయకులు పాల్గొన్నారు.