యాదాద్రి: ప్రముఖ దేవస్తానం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. శ్రావణమాసం తొలి శనివారం కావడంతో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి పెద్దఎత్తున బారులుతీరారు. దీంతో అధికారులు భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా, ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం తీసుకుంటున్నది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.