యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరులో పల్లె ప్రగతి కార్యక్రమానికి వెళ్తూ..మధ్యలో ఆగి వంగపల్లి గ్రామంలోని వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు.
పనులు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీపీవో సునంద, ఎంపీడీవో, ఏంపివో సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.