నారాయణపూర్ మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువరు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇక్కడి వార్డు మెంబర్ సిరిపంగి శివలీల నరసింహ, లింగస్వామి,కృష్ణ గిరి, ఫకీరు, రాజు తదితర నాయకులు.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో వీకంతా టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
నూతనంగా టీఆర్ఎస్లో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు ఒంటెద్దు నరసింహ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.