భువనగిరి కలెక్టరేట్ : ప్రజలు అందించే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుని సమగ్ర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరి, క్యాలెండర్ను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. ధరణిలో వచ్చే భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ భూపాల్రెడ్డి, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్యాంసుందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాల బలరాంరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొప్పుల వెంకట్రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వి, హరికిషన్రావు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.