సీఎ కేసీఆర్ రేపు(శనివారం) యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకోనున్నారు. అక్కడ ప్రెసిడెన్షియల్ సూట్స్ను ప్రారంభించిన తర్వాత యాగశాలను సీఎం పరిశీలిస్తారు.
అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు భువనగిరి చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 కు భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
సాయంత్రం 4 గంటలకు భువనగిరి జిల్లా రాయగిరి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు.