బీబీనగర్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్ మండలం మగ్దుంపల్లి, గొల్లగూడెం గ్రామాల మధ్య రూ.65లక్షల ఆర్అండ్బీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు తగిన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
అనంతరం మగ్దుంపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులకు పైళ్ల ఫౌండేషన్ ద్వారా ఒక్కో కుటుం బానికి రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం బీబీనగర్ మండల కేంద్రంలోని వివిధ వార్డుల్లో రాష్ట్ర నాయకులు గోళి పింగళ్రెడ్డితో కలసి పర్యటించి హెచ్ఎండీఏ నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, పీఏసీ యస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్రెడ్డి, సర్పంచ్లు మం చాల రవి కుమార్, మల్ల గారి భాగ్యలక్ష్మి, గుండబోయిన రమేశ్యాదవ్, పిష్క లక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచ మల్ల శ్రీనివాస్, కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్, నాయకులు ఎండీ అక్బర్, గోలి సంతో ష్రెడ్డి, ఎర్ర శేఖర్రెడ్డి, ఎలుగల నరేందర్, జమ్మిగారి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.