భువనగిరి కలెక్టరేట్ : స్వచ్ఛ ఇన్నోవేటీవ్ టెక్నాలజీ ఛాలెంజ్లో భాగంగా భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ వ్యర్ధాల నిర్వహణలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి పోటీని నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్తివారీ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పౌరుల నుంచి సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో వినూత్న, డిజిటల్ సొల్యూషన్స్ కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్, సామాజిక చేరిక, పారిశుధ్యం, జీరోడంప్, జీరో లిటరింగ్, పబ్లిక్ వేస్ట్ మేనేజ్మెంట్, పారదర్శకత, స్వచ్ఛభారత్ అభియాన్కు సంబంధించిన ఏదైన ఇతర అంశాలపై పోటీ ఉంటుందని తెలిపారు.
పోటీలు జనవరి 6-2022వరకు ఉంటాయని, ఆసక్తి గల పౌరులు మున్సిపల్ కౌన్సిల్లోని ఇన్వార్డ్లో గాని, ఎన్విరాల్మెంట్ మేనేజర్ మహేశ్ ఫోన్ నంబర్ 9959214213, సిస్టమ్ మేనేజర్ 9885151971లను సంప్రదించాలన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ. 15,000, రెండవ బహుమతిగా రూ. 10,000, మూడవ బహుమతిగా రూ. 5,000లు చొప్పున అందించడం జరుగుతుందని పోటీల్లో పౌరులు, విద్యార్ధులు, వాణిజ్య సంస్థలు పాల్గొనాలని పేర్కొన్నారు.