భువనగిరి కలెక్టరేట్ : అతివేగంతో లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భువనగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి నల్గొండ రోడ్డే రాంతడాఖా వైపు అతివేగంగా వచ్చి భాహర్పేట్ సమీపంలో బండారు వెంకట్ ఇంటి ముందు ఎదెరుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో తుఫాన్ వాహణం వెనక ద్విచక్ర వాహణంపై వస్తున్న రేపాక నర్సింహను బలంగా ఢీకొట్టడంతో నర్సింహ(50) మృతి చెందాడు.
విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రమాదానికి గురైన వాహనాలను పోలీస్టేషన్కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు.