రాజాపేట, సెప్టెంబర్ 18 : మదర్ డైయిరీ డైరెక్టర్గా భారీ మెజార్టీతో గెలిపించాలని రాజాపేట పాల సొసైటీ చైర్మన్, బీఆర్ఎస్ మండల సెక్రెటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్ కోరారు. గురువారం హైదరాబాద్ మదర్ డైయిరీలో డైరెక్టర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మదర్ డైయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కర్రే వెంకటయ్య, సట్టు తిరుమలేష్, దొంతిరి సోమిరెడ్డి, మారెడ్డి కొండల్ రెడ్డి, భిక్షపతి ఉన్నారు.