బీబీనగర్, డిసెంబర్ 06 : బీబీనగర్ మండలంలోని రావిపహాడ్ తండా సర్పంచ్గా బానోత్ శంకర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శంకర్ నాయక్ను భువనగిరి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పైళ్ల శేఖర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధికి నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడనున్నట్లు తెలిపారు.