రామన్నపేట, జూలై 12 : భూ భారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం రామన్నపేట తాసీల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన పరిష్కరించుటకు తగు సూచనలు సలహాలు తెలియజేశారు. వచ్చిన ప్రతి దరఖాస్తు భూ భారతిలో తప్పక నమోదు చేయాలన్నారు. దరఖాస్తుదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను సాధ్యమనంత త్వరగా పరిష్కరించి పెండింగ్ లేకుండా డిస్పోజ్ చేయాలన్నారు.
అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేంలా చూడాలన్నారు. భూ భారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను మండల తాసీల్దార్ లాగిన్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పాత రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవెన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.