యాదాద్రి భువనగిరి: వీవీఐపీ విడిది నిమిత్తం యాదాద్రి ఆలయానికి ఈశాన్య భాగంలో ప్రెసిడెన్సియల్ విల్లాలను నిర్మించారు. అందులో ఒక ప్రెసిడెన్సియల్ విల్లా కోసం హైదరాబాద్కు చెందిన కాటూరి మెడికల్ కళాశాల సీఎండీ కస్తూరి సుబ్బారావు రూ. 7.5 కోట్ల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును యాదాద్రి గుడిలో ఆలయ ఈవోకు అందజేశారు.