బొడ్రాయిబజార్, డిసెంబర్ 28 :కార్మికుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని పాత మిర్చి యార్డులో సీఐటీయూ నుంచి సుమారు 200 మంది మున్సిపల్ కార్మికులు బీఆర్ఎస్కేవీ జిల్లా గౌరవ సలహాదారుడు ఆకుల లవకుశ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్లి కృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్కేవీలో చేరారు. వారికి మంత్రి జగ దీశ్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉండేదని ప్రత్యే క రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులకు 30శాతం పీఆర్సీ అమలు చేశారని దేశవ్యాప్తంగా పొరుగు సేవల ఒప్పంద కార్మికులకు పీఆర్సీ అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అ న్నా రు.
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ప్రతి యేటా రూ.60వేల కోట్ల ఖర్చు చేస్తుందన్నారు. గుజరాత్లో కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉందని వారికి భద్రత లేదని, కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు చేస్తూ దాడి చేస్తున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్కేవీలో చేరిన వారిలో కార్మిక నాయకులు వల్దాస్ మధుసూదన్, చాగంటి వెంకటరమణ, బండారు యాద య్య, బొజ్జ యల్లయ్య, దుబ్బ సైదులు, సహదేవులు, దాసు, చిన్న పద్మ, ఎల్లమ్మ, భిక్షం, తలా రి వెంకన్న, నాగేశ్వర్రావు, సైదమ్మ, యాదమ్మ ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు గండూరి ప్రకాశ్, న్యాయవాది బాణాల విజయ్కుమార్, కౌన్సిలర్లు తాహేర్పాషా, కో-ఆప్షన్ సభ్యుడు వెంపటి సురేశ్, బీఆర్ఎస్కేవీ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలువేరు ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ, సయ్యద్ సమ్మి, పాల్గొన్నారు.
నార్ముల్ మదర్ డెయిరీ క్యాలెండర్ ఆవిష్కరణ
మోత్కూరు : మదర్ డెయిరీ 2023 సంవత్సరం క్యాలెండర్ను సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి, డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, మందడి ప్రభాకర్రెడ్డి, గాల్రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, కర్నాటి జయశ్రీఉప్పల్రెడ్డి, చల్లా సురేందర్రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహా రెడ్డి, కోట్ల జలెందర్రెడ్డి, కందాల అలివేలూరంగారెడ్డి, గూడూరు శ్రీధర్రెడ్డి, కస్తూరి పాండు, డెయిరీ ఎండీ అశోక్కుమార్, జీఎంఈ అజయ్కుమార్, డీజీఎంబీ కృష్ణ పాల్గొన్నారు.