మునుగోడు, సెప్టెంబర్ 25 : తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్కు మనుగడ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సుమారు 150మంది ఆదివారం ఆయన సమక్షంలో హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు భవనం శ్రీనివాస్రెడ్డి, దాడి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ బొజ్జ సుజాత, గ్రామశాఖ అధ్యక్షుడు దోటి సైదులు, నాయకులు బొజ్జ శ్రీను, వర్కాల నరేందర్, రాంబాబు, బొజ్జ సైదులు, ఆడెపు వెంకన్న, సునీల్, శ్రీశైలం, నర్సింహ, శంకర్, ప్రశాంత్ పాల్గొన్నారు.