భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే శేఖర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని తాజ్పూర్ వద్ద చిన్నేరువాగుపై చెక్డ్యామ్ నిర్మాణానికి రూ.3.19కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ మండల కమిటీ నాయకులు బుధవారం గ్రామంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. వాగుపై చెక్డ్యామ్ నిర్మాణం పూర్తయితే 300 ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, ఎంపీటీసీ సామల వెంకటేశ్, సర్పంచ్ బొమ్మారపు సురేశ్, ఉప సర్పంచ్ ర్యాకల సంతోషాశ్రీనివాస్, గూడూరు సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, నీల ఓం ప్రకాశ్గౌడ్, నాయకులు అతికం లక్ష్మీనారాయణ, బల్గూరి మధుసూదన్రెడ్డి, అబ్బగాని వెంకట్గౌడ్, జక్కా రాఘవేందర్రెడ్డి, కేశవపట్నం రమేశ్, పోల ప్రవీణ్గౌడ్, కొండల్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కోట గోవర్ధన్, గ్రామస్తులు ఓరుగంటి నాగయ్య, రమేశ్, పల్లెపాటి రామస్వామి, యాకూబ్, నర్సింహ, రాజు, బాలరాజు పాల్గొన్నారు.