భువనగిరి అర్బన్, జూలై 20: ప్రధానమంత్రి స్వానిధి యోజ న పథకం క్రింద జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలోని వీధి విక్రయదారులకు బ్యాంకులు వంద శాతం రుణ సౌకర్యం అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్తివారీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్ర త్యేక ఛాంబర్లో అర్బన్ మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్, అసిస్టెంట్ జి ల్లా మిషన్ కో-ఆర్టినేటర్లు, పట్టణ మిషన్ కో-ఆర్డి నేటర్లు, క మ్యూనిటీ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించి మున్సిపాలిటీల లో పెండింగ్లో ఉన్న వీధివిక్రయదారుల రుణాలపై చర్చించారు. ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి 6869 మంది వీధి విక్ర యదారులకు రుణాలు కాగా, ఇప్పటివరకు 6569మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసినందున మిగిలిన 300ల మంది వీధివిక్రయదారులకు వెంటనే బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించాలని ఆదేశించారు. 85 శాతం మందికి పైగా తక్షణమే రుణాలు అందాలన్నారు. పెండింగ్లో ఉన్న మిగిలిన దరఖాస్తులన్నీ పరిశీలించి బ్యాంకర్లతో చర్చించి అర్వులైన వ్యాపారులందరికీ రుణాలు తక్షణమే అందేలా చర్యలు తీసు కోవాలని మెప్మా అధికారులను ఆదేశించారు. కరోనా, లాక్డౌ న్ నేపథ్యంలో వారి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున తక్షణంరు ణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. సమావేశంలో అర్బన్ మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ రమేశ్ బాబు, మెప్మా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.