భువనగిరి అర్బన్, జూలై 14: నిర్మల్ జిల్లా కుబేర్ మండలంలో ఉపాధిహామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ రావులరాజుపై పాతసాల్వ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించారని, ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీజీఓ జనరల్ సెక్రటరీ, ఎంపీడీవో నాగిరెడ్డి అన్నారు. జిల్లా టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డికి బుధవారం వినితి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తున్న అధికారులపై ప్రజాప్రతినిధులు దాడులకు పాల్పడడం అమానుషమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి ప్రతంలో కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండమడుగు రమేశ్, అడిషనల్ డీఆర్డీవో మాధవి, హెచ్ఆర్ మేనేజర సంపత్కుమార్, ఏపీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ.ఇమాన్యుయల్, ఇసీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఏపీఎం అసోసియేషన్ అధ్యక్షుడు జాని, మాజిద్, నాగరాజు, డీఆర్డీఏ సిబ్బంది, షార్ప్ సిబ్బంది, ఉపాధిహామీ ఉద్యోగులు, కూలీలు ఉన్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి
వలిగొండ, జూలై 14: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాజుపై పెట్రోల్పోసి దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టెక్నికల్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది బుధవారం ఎంపీపీ నూతి రమేశ్రాజ్, ఎంపీడీవో గీతారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్లు హరికృష్ణ, వెంకట్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీలక్ష్మి, సిబ్బంది శ్రీనివాస్, నర్సింహ, వెంకట్, వెంకటాచారి పాల్గొన్నారు.