కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 23 : పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె సీడీపీ, సీబీఎఫ్, ఎస్డీఎఫ్ తదితర పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్ పనుల వివరాల జాబితాను తెలపాలని, త్వరగా వాటిని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీఓ మాన్యానాయక్, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ ఉపేందర్రెడ్డి, ఇంజినీరింగ్, పంచాయతీరాజ్, టీఎస్ఆర్టీసీ, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి బస్ టెర్మినల్ పనుల పరిశీలన
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆలయానికి వచ్చే భక్తుల ప్రయాణ నిమిత్తం కొండకింద చేపడుతున్న యాదాద్రి బస్ టెర్మినల్ పనులను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. యాదాద్రి కొండకు ఉత్తరభాగంలో నిర్మించిన లక్ష్మీపుష్కరిణి పక్కనే రూ. 6.90కోట్ల అంచనా వ్యయంతో ఐదెకరాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా నిర్మిస్తున్న ‘యాదాద్రి బస్ టెర్మినల్’ను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా రాయగిరిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రాంతంలో బస్టాప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిపో మేనేజర్కు ఆదేశించారు.