భువనగిరి అర్బన్,జూలై19: ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న యాజమా న్యాలను గుర్తించి బాలకార్మిక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నా రు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా చౌటుప్పల్ మండలం దామరలోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్లో మధ్యప్రదేశ్ మాండ్ర జిల్లాకు చెందిన 10మంది బాలకార్మికులకు విముక్తి క ల్పించడంపై కలెక్టర్ ఆపరేషన్ ముస్కాన్ బృందాన్ని సోమవారం అభినందించారు. గుర్తించిన బాల కార్మికులను జిల్లా బాలల సం క్షేమ సమితి ముందు హాజరు పరిచి వారి ఆదేశానుసారం మాం డ్ర జిల్లా బాలల సంక్షేమ సమితికి అప్పగించినట్లు తెలిపారు. బా ల కార్మికులను గుర్తించి వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందినట్లు చౌటుప్పల్ ఆర్డీవో ద్వారా దృవ పత్రాలను జారీ చేసి సంబంధిత కంపెనీ యాజమాన్యంపై వెట్టి చాకిరి నిర్మూలన చట్టం, బాల కా ర్మికుల నిషేధిత చట్టం, బాలల న్యాయ పరిరక్షణ చట్టాల క్రింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా విముక్తికి పాటుపడిన బాలల జిల్లా పరి రక్షణ సమితి, యూనిట్ను, పోలీస్, రెవెన్యూ, కార్మికశాఖ, స్త్రీ శి శు సంక్షేమశాఖల అధికారులను క్షేత్రస్థాయి సిబ్బందిని, స్వచ్ఛం ద సంస్థలను కలెక్టర్ అభినందించారు.
బాలల సంక్షేమశాఖ, పోలీసు, రెవెన్యూ కలిసి పని ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం గా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలల్లో చే ర్పించి పునరావాస సౌకర్యం కల్పించాలని, తల్లిదండ్రులకు కూ డా ఈ విషయంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు గుర్తించిన 918 మంది బాలబాలికలను వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు అప్పగించినట్లు అధికారులు చెప్పారు. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా భువనగిరి, చౌటు ప్పల్, యాద గిరిగుట్ట డివిజన్లలో 2021 జూలై 1 నుంచి ఈ నెల చివరి వరకు పోలీసు, కార్మికశాఖ, విద్య, మహిళా శిశు సంక్షేమం, రెవెన్యూ శాఖ, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కార్యచరణ రూ పొందించుకుని ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగిం చాలని సూచించారు.
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ప్రజల నుంచి అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని క లెక్టర్ పమేలా సత్తతి అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్ర మంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. సుమారు 50ఆర్జీలు వివిధ సమస్యలపై ప్ర జావాణిలో అందజేశారు. ఈ అర్జీలు ఎక్కువగా రెవెన్యూ, ఆసరా సంబంధిత సమస్యలపై ఉండగా వీటన్నింటికీ వెంటనే పరిష్కా రం చూపాలని, సబంధిత అధికారులను ఆదేశించారు. కొన్ని సమస్యలను సబంధిత అధికారులతో కలిసి అక్కడికక్కడే పరిష్క రించాలని అధికారులకు సూచించారు.