రెండో రోజు విస్తృతంగా రక్తదాన శిబిరాలు
యాదగిరిగుట్టలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి
భువనగిరిలో రక్తదానం చేసిన ఎమ్మెల్యే శేఖర్రెడ్డి
పెద్దసంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు
కొండమడుగులో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన ప్రణీతాపింగళ్రెడ్డి
నేడు సర్వమత ప్రార్థ్ధనలకు ఏర్పాట్లు మొక్కలు
నాటాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి16(నమస్తే తెలంగాణ ప్రతినిధి);తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా పండుగలా జరుగుతున్నాయి. తొలిరోజు అన్నదానాలతో వేడుకలకు శ్రీకారం చుట్టిన గులాబీ శ్రేణులు రెండో రోజైన బుధవారం ఆపదల్లో ఉన్న రోగుల కోసం విస్తృతంగా రక్తదానం చేశాయి. యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ యువజన విభాగం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి పాల్గొన్నారు. భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి రక్తదానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. బీబీనగర్ మండలం కొండమడుగులో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం చైర్మన్ గోలి ప్రణీతా పింగళ్రెడ్డి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు.గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు యావత్ జిల్లా సమాయత్తమవుతున్నది. ప్రార్థనా మందిరాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతోపాటు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని మూడ్రోజుల సంబురాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తమ అభిమాన నేత బర్త్డే కానుకగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. వృద్ధులు, అనాథాశ్రమాల్లో అన్నదానం చేయడంతో పాటు దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంతోపాటు వెయ్యేండ్లు గుర్తుండిపోయేలా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిన సీఎం కేసీఆర్ కారణజన్ముడని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ 67వ జన్మదినం సందర్భంగా పట్టణంలో 67 మంది యువకులు రక్తదానం చేయడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.
50 మంది రైతులకు సన్మానం.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం వంగపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో 50మంది రైతులను సన్మానించనున్నట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా వారికి ఉజ్వల భవిష్యత్ను అందిస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా అందిస్తూ వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, మోటకొండూర్ జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ కల్లేపల్లి శ్రీశైలం, మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్ తాళ్లపల్లి నాగరాజు, ఆవుల మమతాసాయి, బూడిద సురేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, కో ఆప్షన్ సభ్యురాలు గోర్ల పద్మ, టీఆర్ఎస్ నాయకులు నర్సింహ, శ్రీను, కృష్ణంరాజుగౌడ్ పాల్గొన్నారు.
రక్తదానం.. ప్రాణ దానం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 16 : రక్తదానం ఆపదలో ఉన్నవారికి ప్రాణ దానం అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేపట్టిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఏఎంసీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్ష, కార్యదర్శులు ఏవీ.కిరణ్కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓం ప్రకాశ్గౌడ్, నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్రావు, చెన్న స్వాతీమహేశ్, గాదె శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బీబీనగర్, ఫిబ్రవరి 16: జడ్పీటీసీ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ స్థాయీ సంఘం చైర్పర్సన్ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి బుధవారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి పింగళ్రెడ్డితో కలిసి మండలంలోని కొండమడుగు గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పింగళ్ అన్న సేవాదళ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రణీతా పింగళ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు.. మన బడి కార్యక్రమంతో సర్కారు బడులను మరింత బలోపేతం చేస్తుందన్నారు. విద్యార్థినులు సకాలంలో పాఠశాలకు, తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా సైకిళ్లను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లతారాజేశ్, ఎస్ఎంసీ చైర్మన్ కనకబోయిన రాజమల్లేశ్, మాజీ ఎంపీటీసీ కడెం చంద్రశేఖర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మంచాల రవి, జైనపల్లి సర్పంచ్ బాల మల్లేశ్గౌడ్, పింగల్ అన్న సేవాదళ్ గౌరవాధ్యక్షుడు కాసుల రఘునందన్గౌడ్, అధ్యక్షుడు ఎండీ మోయిన్, ఉపాధ్యక్షుడు తుమ్మల నర్సింహ, ఎలుగల నరేందర్, మహేశ్, భాస్కర్ పాల్గొన్నారు.